ఇలా అడపావారి కథల్ని పరిశీలిస్తే, సమాజంపట్ల ఆయనకుగల నిశిత దృష్టి, సామాజిక, సాంఘిన జీవనంలో మార్పురావాల్సి ఉందని ఆలోచించే సీరియస్నెస్, మనిషి జీవిత కోణాల్ని క్షుణ్ణంగా పరిశీలించే ఆయనకున్న అధ్యయన దృక్పథం మనకు అవగతమవుతుంది. ఆయన కథలు చదువుతుంటే, ‘ఇలాంటి అంశాలమీద కూడా కథలు రాయవచ్చా?’ అనిపిస్తుంది మనకు. అందుకే ఆయన, తరచు అంటూ ఉంటారు, ‘‘రచయితకు సమాజం పట్ల బాధ్యత ఉండాలి’’ అని.నవలలు, వ్యాసాలురామకృష్ణ ఇప్పటివరకు నాలుగు నవలలు రాశారు. ఆయన తొలి నవల ‘అందని ఆదరణ’. 1975లో ఆయన రాసిన ఈ నవలను బహుభాషావేత్త, కళాప్రపూర్ణ పురిపండా అప్పలస్వామి ఆవిష్కరించారు. సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోగల నవలకు ఒక ప్రత్యేకత ఉంటుందనీ, ఆ ప్రత్యేకత ఈ నవలలో ఉందనీ ఈ సభలో పురిపండా ప్రశంసించడం ఎన్నటికీ మరపురాని జ్ఞాపకమని రామకృష్ణ చెబుతారు.
‘దూరాలు దగ్గరవ్వాలి’, ‘అనుబంధాలు’, ‘అతిరథులు’ ఆయన రాసిన ఇతర నవలలు. ‘అతిరథులు’ నవల ‘అతిరథి’ పేరిట హిందీలోకి అనువాదమైంది. ఆయన వ్యాసాలు ‘సాహితీ ఉద్యమంలో కరదీపికలు’ పేరిట పుస్తకంగా వచ్చాయి.సుమారు ఐదున్నర దశాబ్దాల సాహిత్య ప్రయాణంలో పలు సాహితీ ప్రతిభాపురస్కారాలు అందుకున్న రామకృష్ణ ‘విశాఖ ఆణిముత్యం’ గా గుర్తింపు పొందారు.విశాఖరచయితల సంఘంవిశాఖరచయితల సంఘంతో అడపా రామకృష్ణకు 48ఏళ్ళ అనుబంధం. ఆ సంఘ ప్రధానకార్యదర్శిగా అనేక సాహితీకార్యక్రమాలు చేస్తున్నారు. అభ్యుదయ కవి ఆవంత్స సోమసుందర్ మరణించినప్పుడు ‘ఆవంత్స కవితాభ్యుదయం’ అనే పుస్తకం రాశారు. ‘విశాఖ కథా తరంగాలు’ పేరిట 40మంది కథకుల కథల్ని రెండు భాగాలుగా సంకలనం చేసి ప్రచురించారు. ఆంధ్రప్రదేశ్లోని 50మంది కథకుల కథల్ని ‘సింగిల్ పేజీ కథలు’ సంకలనంగా తెచ్చారు. బలివాడ కాంతారావు స్మారక వ్యాససంపుటి సంకలనం, ‘డా. వుప్పల లక్ష్మణరావు సాహితీస్ఫూర్తిమంత్రం’ వ్యాస సంకలనం ప్రచురించారు.
రచన పదికాలాలుండాలంటే.. ..ఎంచుకునే వస్తువును బట్టే సాహిత్య ప్రక్రియ ఉంటుందంటారు రామకృష్ణ. ‘‘రచనావస్తువు సమాజ శ్రేయస్సు, సంస్కరణ దిశగా సాగితే అది పది కాలాలపాటు ఉండిపోతుంది. నేటి సాహిత్యంలో సామాజిక స్పృహ తగినస్థాయిలో లేదు. కొందరు రచయితలు సత్కారాలు, పురస్కారాలకోసం రాస్తున్నట్టే ఉంటోంది. కథారచయిత తన చుట్టూ సమాజాన్ని పరిశీలిస్తూ, సాహితీవస్తువును దొరకబుచ్చుకుని దృశ్యమానం చేయాలన్నది నా అభిప్రాయం’’ అంటారు రామకృష్ణ.కుటుంబండిగ్రీ పూర్తిచేసి 1972లో విశాఖ నేవల్ బేస్ ఆఫీస్లో సూపర్వైజర్ ఉద్యోగంలో చేరి నాలుగు దశాబ్దాలు పనిచేసి 2011లో రిటైరయ్యారు రామకృష్ణ. ఆయన సతీమణి దుర్గా మహాలక్ష్మి. వారికి ఇద్దరు పిల్లలు. ముగ్గురు మనవలు. అబ్బాయి శివకోమల్. కోడలు దీపిక. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్. అమెరికాలో స్థిరపడ్డారు. కూతురు సునంద. అల్లుడు సుబ్రహ్మణ్యం.